హైదరాబాద్ : మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 70 మందికి నాంపల్లి కోర్టు రూ. 7 లక్షల జరిమానా విధించింది. నాంపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 70 మంది పోలీసులకు పట్టుబడ్డారు. వారిని కోర్టులో బుధవారం ప్రవేశపెట్టారు. వీరిలో 59 మందికి ఒక్కొక్కరికి రూ. 10,500, ఆరుగురికి రూ. 500 చొప్పున, ఐదు రోజుల జైలు శిక్ష, మరో నలుగురికి ఒక్కొక్కరికి రూ. 16,500, మరొకరికి రూ. 16,500, మూడు రోజుల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని ఇన్స్పెక్టర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm