రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్దేవుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో పాడైపోయిన రబ్బరు టైర్ల గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మంటలు పక్కనే ఉన్న మరో ప్లాస్టిక్ గోదాంకు అంటుకున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటల అదుపునకు యత్నిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా గోదాములను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm