బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామిపై, ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి బీ శ్రీరాములు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నాయకుడు హెచ్డీ కుమారస్వామి ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని, ఆయన పాకిస్థాన్ దేశానికి వెళ్లిపోవడం మంచిదని మంత్రి శ్రీరాములు సూచించారు. మాజీ సీఎం కుమారస్వామి భారతదేశంలో నివశిస్తూ పొరుగుదేశమైన పాకిస్థాన్ పై ప్రేమ చూపిస్తూ,ద్వంద్వ రాజకీయాలకు పాల్పడుతున్నారు... ఆయన పాకిస్థాన్ దేశానికి వెళ్లి పోవడం మంచిది అని మంత్రి శ్రీరాములు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm