యాదాద్రి భువనగిరి: ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ నగర్ కు చెందిన కోనేరు చిన్న యాదగిరి మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm