ముంబై: వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ఏటా పద్మశ్రీ పురస్కారాలను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా శనివారం కేంద్రప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. చలనచిత్ర రంగానికిగానూ ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్, ఏక్తాకపూర్తోపాటు బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు కూడా పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కంగన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ అవార్డును మహిళలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ‘నాకెంతో గౌరవంగా, సంతోషంగా ఉంది. గౌరవప్రదమైన గుర్తింపు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ధైర్యంగా కలలు కనే ప్రతి స్త్రీకి ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. ప్రతి కుమార్తె.. ప్రతి గృహిణి.. మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రతి మహిళకు ధన్యవాదాలు’ అని కంగన పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm