హైదరాబాద్ : రాష్ట్ర పండుగ మేడారం మహా జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఈసారి ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా ప్రచారం చేస్తున్నారు. భక్తులెవ్వరూ ప్లాస్టిక్ కవర్లు.. వస్తువులు తీసుకురావద్దని ఇప్పటికే తెలియజేశారు. ఆర్టీసీ బస్టాండ్లు, గ్రామ పంచాయతీల వద్ద ప్రచార బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. దేశ విదేశాల నుంచి కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm