హైదరాబాద్ : ఇరాక్ మరోసారి అట్టుడికింది. రాజధాని బాగ్దాద్ లోని హై సెక్యూరిటీ జోన్ లో ఉన్న యూఎస్ ఎంబసీ లక్ష్యంగా ఆదివారం రాత్రి రాకెట్ దాడులు జరిగాయి. ఈ రాకెట్ దాడులను పలు ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు వెల్లడించాయి. అమెరికా రాయబార కార్యాలయం ప్రహరీ గోడకు సమీపంలోనే ఐదు రాకెట్లు పడ్డాయని తెలుస్తుండగా, దీనిపై అమెరికా గానీ, ఇరాక్ గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇటీవల ఇరాన్ మేజర్ జనరల్ ఖాసీమ్ సులేమానీని అమెరికా సైన్యం హతమార్చిన అనంతరం మొదలైన ప్రతీకార దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm