హైదరాబాద్: చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ఒక్కో దేశంలోకి చాప కింద నీరులా వ్యాపిస్తున్నది. ఈ కరోనా వైరస్ వ్యాప్తి నుంచి తమ దేశ ప్రజలను కాపాడుకునేందుకు ఆయా దేశాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి లేదని నిర్థారణ అయ్యే వరకూ ఎవరినీ కలవనీయకుండా క్వారెంటైన్ లో ఉంచి మరీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా అని తేలితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులలో వారికి చికిత్స అందిస్తూ రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఉత్తర కొరియా మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. కరోనా వైరస్ సోకినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తిని దారుణంగా చంపేసింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మీడియా ప్రచురించింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పోకడలను చాటిచెప్పే ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ తమ దేశంలోకి ప్రవేశించకుండా ఉత్తర కొరియా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. ఇందుకోసం సైనిక చట్టాలను కూడా అమలు చేస్తోంది. విధి నిర్వహణలో భాగంగా ఆ అధికారి ఇటీవల చైనాకు వెళ్లి రావడంతో ఉత్తర కొరియా అధికారులు ఆ అధికారిని మొదట నిర్బంధించారు. అతడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు.. అక్కడ అధికారి ఓ పబ్లిక్ బాత్ రూంలో స్నానం చేయడానికి వెళుతుండటంతో నీటి ద్వారా కూడా కరోనా సోకుతుందని భావించి అతడిని ఏకంగా చంపేశారు. అంతేకాదు చైనా నుంచి వచ్చిన వారిని, చైనా ప్రజలను నిర్బంధించాలని ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు జారీచేశారు. కరోనా వైరస్ సోకిన వారైవరైనా సరే వారిని చంపివేయాలని కిమ్ జోంగ్ ఉన్ మోఖిక ఆదేశాలు జారీ చేశారు. చైనాతో సరిహద్దులను మూసివేశారు. పర్యాటకులను నిషేధించింది. కరోనా వైరస్ చ్ఛాయలు తమదేశంలోకి రాకుడదని పేర్కొంటూ దేశలో సైనిక చట్టాలను అమలు చేస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm