గువాహటి : అస్సాంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఈరోజు ఉదయం జాతీయ రహదారి-37పై జోరాబాట్ ప్రాంతంలో ఓ కారులో నుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కారు ముగ్గురు వ్యక్తులు ప్రయాణీస్తున్నారు. మంటలు అంటుకున్న వెంటనే వారు కారు అద్దాలను పగలుగొట్టుకుని బయటకు దూకారు. దీంతో ప్రమాదం నుండి వారు తృటిలో తప్పించుకున్నారు. ఘటన స్థలం పక్కనే ఉన్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేసారు. షార్ట్క సర్క్యూట్ కారణంగా కారులో మంటలు వచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు.
Mon Jan 19, 2015 06:51 pm