హైదరాబాద్ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ ఎంఐఎం పార్టీ విజయవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఏఏ, ఎన్సార్సీ నిర్ణయాలు సరికాదని అన్నారు. ఇటీవల తన తల్లి బర్త్ సర్టిఫికెట్ లేదని చెబితే, ఆమెకు ఇప్పటికిప్పుడు బర్త్ సర్టిఫికెట్ ఎలా తేవాలో అర్థం కాలేదని, ఓ ఎంపీనైన తన పరిస్థితే అలావుంటే, సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. ఆవిడ పౌరసత్వాన్ని ఎలా నిరూపించాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కేరళ ప్రభుత్వం అక్కడి అసెంబ్లీలో సీఏఏ, ఎన్నార్సీలపై తీర్మానం చేసిందని, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం కూడా అదే విధంగా అసెంబ్లీలో సీఏఏ, ఎన్సార్సీలను వ్యతిరేకిస్తున్నట్టు తీర్మానం చేయాలని కేశినేని నాని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm