సిద్దిపేట: జిల్లాలోని గజ్వేల్లో యువతి దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు యువతి గొంతు కోసి హత్య చేశారు. మృతురాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన దివ్య(24)గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm