హైదరాబాద్ : రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించే మైనారిటీ విద్యార్థులకు (ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, బౌద్దులు, పార్శీలు) సీఎం విదేశీ విద్యాపథకం (సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం) కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ (ఇంజనీరింగ్)లో 60శాతం మార్కులు ఉండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్య అభ్యసించేదలచిన వారితో పాటు పీజీలో 60శాతం మార్కులు వచ్చి పీహెచ్డీ చేయాలనుకునే వారు మాత్రమే ఈ పథకంలో అర్హులని పేర్కొన్నారు. ఈ పథకంపై మరిన్ని వివరాలకు 040-23240134 నంబరులో, లేదా జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయం హౌజ్హౌస్ ఆరవ అంతస్తులో సంప్రదించవచ్చన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm