ఖానాపూర్: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఖానాపూర్కు చెందిన వేముల రంజిత్ (20) యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న రంజీత్ తన మిత్రునితో కలిసి ద్విచక్రవాహనంపై ఖానాపూర్ వస్తుండగా ఇందల్వాయి వద్ద ఢీవైడర్ను ఢీకొనడంతో రంజిత్ అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఖానాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన వేముల మల్లేష్ మంగ దంపతుల పెద్ద కుమారుడు రంజిత్ ప్రమాదంలో మృతి చెందడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm