యాదాద్రి: పట్టణంలోని ఓ ఇంట్లో మంగ ళవారం పట్టపగలు చోరీ జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బీసీ కా లనీకి చెందిన శివరాత్రి ఐలయ్య కుటుంబసభ్యులు ఉదయం ఇంటికి తాళం వేసి కూలీ పనులకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దండగులు మధ్యాహ్నం గేట్ పైనుంచి వెళ్లి లోపల తాళం విరగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరు పగులగొట్టి అందులోని 2తులాల బంగారం ఆభరణాలు, 20తులాల వెండి, రూ.30వేల నగదు చోరీకి పాల్పడ్డారు. ఇం టి యజమాని మధ్యాహ్నం భోజనానికి వచ్చే వరకు చోరీ జరగడంతో పోలీసులకు సమాచారం అందించాడు. స్థానిక ఎస్ఐ రాజు సంఘటన స్థలానికి వచ్చి పూర్తి వివరాలు సేకరించారు.
Mon Jan 19, 2015 06:51 pm