జనగామ: పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో పంచాయతీలు, మునిసిపాలిటీల్లో చేపట్టిన వాహనాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. తన అనుచరులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతోనే వాహనాల కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలో ఆయన అన్నారు. హామీలను విస్మరించిన సీఎం కేసీఆర్.. మరోసారి పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తున్నారని మండిపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm