గుంటూరు: అప్పులబాధతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం వింజనంపాడులో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వింజనంపాడుకు చెందిన కేతావత్ మోతిలాల్ నాయక్ (42) పది ఎకరాలు కౌలుకు తీసుకొని పదేళ్ల నుంచి పత్తి, మిర్చి, మినుము పంటలు సాగు చేస్తున్నాడు. వ్యవసాయంలో వరుసగా నష్టాలు చవిచూసిన అతనికి అప్పులు రూ. 10 లక్షలు తేలాయి. వాటిని ఎలా తీర్చాలోనని మనస్తాపం చెంది సోమవారం రాత్రి ఇంటిలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబీకులు గుంటూరు జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm