న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ఢిల్లీ సిఎం అయిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కేజ్రీవాల్ తొలిసారి భేటీ కాబోతున్నారు. కాసేపట్లో వీరి సమావేశం ప్రారంభంకానుంది. ఎన్నికల ప్రచార సమయంలో ఆప్, బిజెపి నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు గుప్పించుకున్నారు. ఎన్నికల ప్రచారం యుద్ధాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో, వీరిద్దరి భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరోవైపు తన ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడిని కేజ్రీవాల్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే, తన సొంత నియోజకవర్గం వారణాసిలో పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్న మోడి కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి హాజరుకాలేకపోయారు. అయితే, ట్విట్టర్ ద్వారా కేజ్రీవాల్కు మోడి శుభాకాంక్షలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm