హైదరాబాద్ : హీరో శ్రీకాంత్ని పరామర్శించారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్. శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వర్ రావు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ని బుధవారం పరామర్శించారు మంత్రి తలసాని. మధ్యాహ్నం ఒంటిగంటకు వెళ్లి శ్రీకాంత్ కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మేక పరమేశ్వర్ రావు చిత్ర పటానికి నివాళులర్పించారు. అలాగే తండ్రి మరణం గురించి శ్రీకాంత్తో మాట్లాడారు. మంత్రి వెంట ఎమ్మెల్సీలు నవీన్ యాదవ్, ప్రభాకర్లు కూడా ఉన్నారు. కాగా.. మంగళవారం మెగాస్టార్ చిరంజీవి వెళ్లి శ్రీకాంత్ని పరామర్శించి, ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm