న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 70 లక్షల మందితో ట్రంప్కు స్వాగతం పలుకుతున్నారు... ఆయనేమైనా దేవుడా? అని సూటిగా ప్రశ్నించారు. వ్యక్తిగత అవసరాల నిమిత్తమే ట్రంప్ భారత్లో పర్యటిస్తున్నారని విమర్శించారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు లేవని, కేవలం అమెరికా అవసరాల నిమిత్తమే పర్యటిస్తున్నారని, భారత ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని అధీర్ అన్నారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుజరాత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm