Looks simply spectacular. A moment to cherish for every Indian cricket lover. World class facility seating 110,000 plus @JayShah #MoteraStadium 🇮🇳🏏 https://t.co/qewlb8XMAw
— Ravi Shastri (@RaviShastriOfc) February 19, 2020
హైదరాబాద్: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్.. మెల్బోర్న్లోని ఎంసీజీ.. ఈ స్టేడియాల్లో క్రికెట్ మ్యాచ్ జరిగిందంటే.. ప్రేక్షకుల సంఖ్య లక్ష ఉండాల్సిందే. ఇప్పుడు ఆ సంఖ్యను దాటేసేందుకు కొత్త స్టేడియం తయారైంది. అహ్మదాబాద్లోని మొతారా స్టేడియం.. మెగా స్టేడియంగా రూపుదిద్దుకున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమైన ఈ స్టేడియాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రారంభించనున్నారు. ఈనెల 24వ తేదీన ట్రంప్, మోదీలు ఈ స్టేడియాన్ని ఆవిష్కరిస్తారు. కెమ్చో ఈవెంట్లో భాగంగా ఈ స్టేడియాన్ని ప్రారంభించనున్నారు. సుమారు లక్షా పది వేల మంది ప్రేక్షకులు ఈ స్టేడియంలో మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. మొతెరా స్టేడియానికి సంబంధించిన కొత్త ఫోటోను ఇవాళ బీసీసీఐ ట్వీట్ చేసింది. ఏరియల్ వ్యూలో తీసిన ఆ ఫోటోలో మొతెరా స్టేడియం కలర్ఫుల్గా కనిపిస్తోంది. ఈ ఫోటోను ట్వీట్ చేసిన వెంటనే .. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా స్పందించారు. ఇంత పెద్ద భారీ స్టేడియాన్ని తిలకించడం ఆనందంగా ఉందన్నాడు. ప్లేయర్గా, కెప్టెన్గా ఈ స్టేడియంలో ఆడిన అనుభూతిని మరిచిపోలేనన్నాడు.