అమరావతి: మంగళగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మార్వో శ్రీనివాసరావును కృష్ణాయపాలెం రైతులు అడ్డుకున్నారు. పేదలకు భూములు ఇచ్చే ప్రతిపాదనతోనే.. ప్రభుత్వ భూములను పరిశీలన చేస్తున్నామని ఎమ్మార్వో శ్రీనివాసరావు తెలిపారు. ప్రైవేట్, రైతుల భూముల వివరాలు సేకరించడం లేదని ఎమ్మార్వో వెల్లడించారు. సీఆర్డీఏ చట్టాన్ని అనుసరించి ప్రభుత్వ భూములు కూడా మాస్టర్ ప్లాన్లో ఉన్నాయని రైతులు పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరు, లేదా ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కేటాయిస్తే నిబంధనలకు విరుద్ధమని రైతులు వాదించారు.
Mon Jan 19, 2015 06:51 pm