హైదరాబాద్ : తక్కువ ధరల్లో విమానప్రయాణం అందించే విమానయాన సంస్థ స్సైస్జెట్ నుంచి మరో 20 విమానాలు రానున్నాయి. మార్చి 29 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నట్టు ఆ సంస్థ అధికారవర్గాలు తెలిపాయి. కొత్త విమానాలు గౌహాతీ-పట్నా, హైదరాబాద్- మంగుళూరు, బెంగళూరు-జబల్పూర్, పట్నా-వారణాశి, ముంబాయి- ఔరంగబాద్ల మధ్య సర్వీసు నడపనున్నట్టు సంస్థ తెలిపింది. ఈ కొత్త సర్వీసులతో దేశీయంగా 12 నగరాలను కలుపుతూ 52 విమానాలను వినియోగంలోకి వస్తాయని స్పైస్జెట్ పేర్కొంది. ఆ సంస్థ ముఖ్య వాణిజ్య అధికారి శిల్పా భాటియా మాట్లాడుతూ.. దేశీయంగా ప్రయాణికులకు అందుబాటులో ఉండే టికెట్టు ధరలతో తమ విమానసర్వీసులు నడుపుతున్నామని, మరిన్ని విమాన సర్వీసులను పెంచి ఇప్పటివరకు ఎయిర్కనెక్టివిటీ లేని ప్రాంతాలలో కూడా విస్తరిస్తామన్నారు. అలాగేముంబయి-చెన్నై, హైదరాబాద్- మంగళూరు, గౌహాతీ-ఢిల్లీల మధ్య రానున్న కాలంలో బోయింగ్ 737-800, బోంబార్డియర్ క్యూ400 విమానాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm