హైదరాబాద్: మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఏసీ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జికూటివ్ డైరెక్టర్ తెలిపారు. మియాపూర్-1, మెహదీపట్నం డిపోలకు చెందిన ఈ బస్సులు లింగంపల్లి, ఎంజీబీఎస్ బస్టాండ్ల నుంచి నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం రోజున దేశ వ్యాప్తంగా మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఈ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. 18 సీట్లు కలిగిన ఈ బస్సుల్లో ప్రయాణ చార్జీలను కూడా నిర్ణయించారు. లింగంపల్లి నుంచి శ్రీశైలం వరకు రూ.530, ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలం వరకు రూ.500 అని నిర్ణయించారు. అయితే, భక్తుల రద్దీని బట్టి హైదరాబాద్లోని పలు కాలనీల నుంచి కూడా బస్సులు నడపనున్నట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm