ముంబై: మాజీ టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన తరువాత కొత్త దారులు వెతుకున్నాడు. అంతర్జాతీయ, ఐపీఎల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ.. యువరాజ్ సింగ్ అడపా దడపా ఇతర టీ-20, టీ-10 మ్యాచ్లు ఆడుతూ వస్తున్నాడు. త్వరలో జరగనున్న రోడ్ సెఫ్టీ వరల్డ్ టీ-20 సిరీస్పైనా యూవీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే.. డ్యాషింగ్ బ్యాట్స్మెన్ యువరాజ్.. త్వరలో ఓ వెబ్ సిరీస్ద్వారా తెరంగేట్రం చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అస్సాం కు చెందిన డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్ నిర్మించిన వెబ్సిరీస్లో యూవీ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. యూవీ సోదరుడు జోరవర్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సిరీస్లో యూవీ భార్య హాజెల్ కీచ్, తల్లి శబ్నమ్ సింగ్ కూడా ఉన్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే, ఈ ప్రచారంపై తాజాగా యూవీ స్పందించాడు. ఆ వార్తలో ఎంతమాత్రం నిజం లేదంటూ తేల్చి చెప్పేశాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించిన యూవీ.. వెబ్సిరీస్లో తన సోదరుడు నటిస్తున్నాడని, తాను కాదని క్లారిటీ ఇచ్చాడు. తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ పచ్చి అబద్ధం అని కొట్టిపారేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm