చెన్నై: తమిళనాడులోని శివకాశి సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు చోటుచేసుకోవడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. దాదాపు ఎనిమిది మందికి గాయాలైనట్లు సమాచారం. పేలుడు ధాటికి బాణసంచా తయారీ కూలీలు దూరంగా ఎగిరిపడ్డట్లు తెలుస్తోంది. కర్మాగారం యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm