మధ్యప్రదేశ్: తమ ఉద్యోగాలు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడంలేదని ఆగ్రహించిన ఓ మహిళా గెస్ట్ లెక్చరర్ గుండు గీయించుకొని తన నిరసన తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని భోపాల్లో వందలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు.. తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలని నిరసనలు తెలుపున్నారు. ఈ సందర్భంగా సదరు ఉద్యోగిని మాట్లాడుతూ.. గత 72 రోజులుగా ఇక్కడ తమ నిరసనలు, భాదలు తెలుపుతున్నా.. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm