హైదరాబాద్: తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో 2020-2021 సంవత్సరానికిగాను 5వ తరగతిలో అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని మర్రిపల్లిగూడ మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ స్రవంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 6, 7, 8 తరగతుల్లోని బ్యాక్లాగ్ మైనార్టీ సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు. 5వ తరగతిలో ప్రవేశానికి అభ్యర్థులు 2019-2020 నాలుగో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. 2008కి ముందు జన్మించి ఉండాలి. 31-08-2011 తరువాత జన్మించి ఉండరాదు, దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వారై ఉండాలి. తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతం వారికి లక్షా యాభైౖ వేలు, పట్టణ వాసులకు రెండు లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండాలని తెలిపారు. దరఖాస్తు ఫారంతో పాటు బోనోఫైడ్, ఆధార్కార్డు, పాస్ఫొటో జతపరచాలని, దరఖాస్తు ప్రక్రియకు వచ్చే నెల 20 వరకు గడువు ఉంటుందని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm