హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు ఉందని, అర్థరాత్రి 12.30 గంటలకు అది పేలుతుందని ఓ అజ్ఞాత వ్యక్తి కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయడంతో..ఆదివారం పోలీసులు మెరుపు తనిఖీలు చేపట్టారు. గోపాలపురం, సికింద్రాబాద్ ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులతో పాటు బాంబు, డాగ్స్క్వాడ్ బృందాలు రైల్వే ప్రయాణికుల బ్యాగులను తనిఖీచేశాయి. రైల్వేస్టేషన్ ముందు నుంచి మొదలుపెట్టి ప్రధాన ద్వారాలు, ఒకటో నెంబరు నుంచి 10వ నెంబరు ప్లాట్ఫాం వరకు ఈ తనిఖీలు జరిపారు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. సనత్నగర్ ప్రాంతంలో నుంచి ఆ వ్యక్తి ఫోన్ చేసినట్లుగా సెల్టవర్ సిగ్నల్ నుంచి తెలుసుకుని దర్యాప్తు ఆరంభించారు. తనిఖీల్లో గోపాలపురం ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్, ఆర్పీఎఫ్ సీఐ బెనయ్, ఎస్సై సైదులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm