జోగులాంబ గద్వాల: వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి బొల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో పయణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన తెల్లవారుజామున బీచుపల్లి వద్ద చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి నంద్యాల వెళ్తుండగా.. ఈ ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm