సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్సు డిపో వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. టిప్పర్, బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బైక్పై ఉన్న బుమనోళ్ల శేఖర్(22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు సాయి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm