ఆదిలాబాద్: కారు, బైక్ ఒకదానికొకటి ఢీకొనడంతో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సమీపంలో కారు.. బైక్ ఢీ కొన్నాయి. బైక్పై ఉన్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గుంటూరు జిల్లాలో పిడుగురాళ్ళకు చెందిన ఎలుమోలు అంజి, లక్ష్మీగా గుర్తించారు. ఈ దంపతులిద్దరరూ వంట పాత్రలు అమ్ముకుని జీవిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm