హైదరాబాద్: సోషల్ మీడియాలో ఒక నవజాత శిశువుకు సంబంధించిన ఫొటో వైరల్గా మారింది. ఈ ఫొటో బ్రెజిల్లోని రియో డీ జెనెరియోకు సంబంధించినది. అక్కడ ఇటీవల ఒక మహిళ పండంటి శిశువుకు జన్మనిచ్చింది. వైద్యులు బొడ్డు తాడు కట్ చేసేముందు ఆ శిశువును ఏడిపించేందుకు ప్రయత్నిస్తుండగా, ఆ శిశువు ఇచ్చిన రియాక్షన్కు వైద్యులు కంగుతిన్నారు. దీనికి సంబంధించిన ఫొటో కెమెరాలో బందీ అవడంతో పాటు బయటకు రాగానే వైరల్గా మారింది. ఈ ఫొటోను చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ శిశువు పుట్టిన వెంటనే ఏడవలేదు. దీంతో వైద్యులు బొడ్డుతాడు కట్ చేసేముందు ఆ శిశువును ఏడిపించే ప్రయత్నం చేశారు. (మహిళా పోలీస్పై ఉన్నతాధికారి లైంగికదాడి) దీంతో ఆ శిశువు వైద్యులవైపు ఉరుముతున్నట్టు చూసింది. మొదట ఆ శిశువు చూపును గమనించిన వైద్యులు కంగుతిన్నప్పటికీ తరువాత తేరుకున్నారు. ఆ శిశువు పూర్తి ఆరోగ్యంతో ఉండటంతో సంతోషం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm