హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో అవకతవకలపై మీడియాకు గుర్తు తెలియని వ్యక్తి లేఖ రాయడం కలకలం రేపుతోంది. ఏడాదిగా 20 మంది సర్జన్లు విధులకు హాజరుకావడం లేదని అయినప్పటికీ సూరింటెండెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని లేఖలో పేర్కొన్నాడు. సర్టిఫికెటక్లు ఇస్తే ఇంటర్న్షిప్ లేకుండానే డాక్టర్స్ అవుతారని తెలిపాడు. హౌస్ సర్జన్లు ఆస్పత్రికి డుమ్మా కొట్టేలా సహకరిస్తున్నారని, దీని వల్ల కష్టపడుతున్న హౌస్ సర్జన్లపై పనిభారం పెరిగిందని లేఖలో చెప్పుకొచ్చాడు. కష్టపడి చదువుకున్న వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నాడు. త్వరలో పేర్లతో సహా మరో లేఖ పంపుతానంటూ గుర్తు తెలియని వ్యక్తి లేఖలో పేర్కొన్నారు. ఈ ఆకాశరామన్న లేఖపై గాంధీ ఆస్పత్రిలో తీవ్ర చర్చ జరుగుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm