యదాద్రి భువనగిరి: చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ధర్నా కొనసాగుతోంది. తన విషయంలో టోల్ ప్లాజా సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయన టోల్గేట్ వద్దే ధర్నాకు దిగారు. టోల్గేట్ సిబ్బంది ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నారన్నారు. గన్మెన్ను తీసుకోకపోవడం తన ఇష్టమని నర్సిరెడ్డి స్పష్టం చేశారు. గన్మెన్ లేకపోతే ఎమ్మెల్సీ కాదనడం విడ్డూరంగా ఉందన్నారు. తమకు టోల్ ఫీజు మినహాయింపు ఉందని.. ఫ్రీ ట్యాగ్ ఇస్తారని చెప్పారని.. అదే అడిగితే రేపిస్తాం.. మాపిస్తామంటూ వాయిదా వేస్తున్నారన్నారు. ఒకవేళ డబ్బులు చెల్లించే వెళ్లాలంటే చెల్లిస్తానని నర్సిరెడ్డి తెలిపారు. తమ ముందే ప్రజాప్రతినిధులు కాని వారిని పంపుతున్నారన్నారు. సహనం నశించే ఈ రోజు ధర్నాకు దిగానని తెలిపారు. సంబంధిత జాతీయ రహదారి సంస్థ అధికారులు వచ్చి క్లారిటీ ఇస్తేనే ధర్నా విరమిస్తాను ఎమ్మెల్సీ నర్సిరెడ్డి స్పష్టం చేశారు.
మందుబాబు హల్ చల్.. మందు ఇవ్వకపోతే చచ్చిపోతా వైరల్ వీడియో Click Here
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 24,2020 11:31AM