సూర్యాపేట: జిల్లాలోని మున్సిపాలిటీ 2వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి జగదీష్రెడ్డి సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డుల్లోని వీధులను, ఇళ్లను కలియ తిరిగిన మంత్రి జగదీష్ అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, కలెక్టర్ విజయ్కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm