హైదరాబాద్: కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు చాలా వరకు ప్రపంచ దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఇప్పుడు రష్యా కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నది. ఈ వారం మొత్తం కార్యాలయాలు బంద్ చేస్తున్నట్లు ఇటీవల అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆయన ఈ చర్యలు తీసుకున్నారు. ఇండ్ల వద్దనే ఉండాలంటూ ప్రజలకు ప్రభుత్వం ఆదేశాలు ఇస్తున్నది. అయితే లాక్డౌన్పై క్లారిటీ లేకపోవడంతో.. అనేక మంది రష్యన్లు అయోమయంలో పడ్డారు. దేశంలో ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా.. ఆంక్షలను ఏప్రిల్ 5వ తేదీ వరకు పొడగించనున్నట్లు తెలుస్తోంది. రష్యాలో కరోనా సంక్రమించిన వారి సంఖ్య వెయ్యి దాటింది. దాంట్లో ఎక్కువ వరకు కేసులు మాస్కోలనే రిపోర్ట్ అయ్యాయి. ఉద్యోగులకు పెయిడ్ వీకాఫ్ను పుతిన్ ప్రకటించడంతో.. జనం స్వంత ఊళ్లకు వెళ్లేందుకు ఎగబడుతున్నారు. రెండు రోజుల క్రితమే పుతిన్.. మాస్కోలో వైరస్ చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm