ఢిల్లీ: ఒకపక్క కరోనా మహమ్మారి పంజా విసురుతుంటే... దేశదేశాలు స్తంభించిపోయాయి. మన దేశంలోనూ వ్యాధి విజృంభణ ఒకవైపు... ప్రణాళికలేని లాక్డౌన్తో మరోవైపు రోజువారీ వేతన జీవుల ఇక్కట్లు మరోవైపు. రోజుకూలీలతో పాటు, అసంఘటితరంగంలో పనిచేసే లక్షలాది మంది వేతన జీవులూ నానా అగచాట్లూ పడుతున్నారు. ఉత్తర్ప్రదేశ్ నొయిడాలో వలస కార్మికులు కుటుంబసమేతంగా నడిచి సొంత ఊర్లకు పయనమయ్యారు. మహిళలు, పిల్లలను వెంటబెట్టుకుని భారీ సంఖ్యలో జాతీయ రహదారిపై కాలినడక సాగిస్తున్నారు. మా కంపెనీలకు సెలవులిచ్చారు, మేమిక్కడుండి ఏం చేయాలి అంటూ ఆవేదన చెందుతున్నారు. ఢిల్లీ నుంచి ఒకటి రెండు కాదు వందల కిలోమీటర్లు మేర రిక్షా తొక్కుతూ సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకున్న కొంతమంది రిక్షావాలాలను అక్షరధామ్ పోలీసులు అడ్డకున్నారు. ప్రత్యేక బస్సులైనా ఏర్పాటు చేస్తాం కానీ, కేవలం ఇంటికెళ్లేందుకు ఇంతటి సాహసాలు చేయొద్దని వారు కోరుతున్నారు. అయినా కార్మికులు వారి మాటను పట్టించుకోకుండా స్వగ్రామాలకు వెళ్లేందుకే సాహసిస్తున్నారు. ఇక్కడ మాకు పని దొరకట్లేదు. అందుకే, మా రిక్షాలోనే బంగాల్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మేమిద్దరం రిక్షా తొక్కుతాం. ఇలా వెళితే కనీసం 7 రోజుల్లో మేము ఇళ్లు చేరుతాం. కానీ, పోలీసులు మమ్మల్ని వెనక్కి పంపించేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
బస్సుల కోసం
వలస కార్మికుల కోసం ఉత్తర్ప్రదేశ్ ఆర్టీసీ ఢిల్లీ నుంచి ప్రతి రెండు గంటలకు ఓ బస్సు ఏర్పాటు చేసింది. దీంతో సమయానికి బస్సులు అందుకునేందుకు వందల సంఖ్యలో జనం గుమిగూడారు. దిల్లీ, గురుగ్రామ్ల నుంచి సొంత గ్రామాలకు వెళ్లేందుకు బస్టాండుల్లో బారులు తీరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 28,2020 02:49PM