హైదరాబాద్ : మర్కజ్ నుండి వచ్చిన వారికి, వారి బంధువులకు కలిపి రాష్ట్రంలో కొత్తగా 15 మందికి ఈ రోజు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతానికి 77 మంది యాక్టీవ్ పాజిటివ్ కేసులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా తాజా పరిస్థితిపై మంత్రి మాట్లాడుతూ.. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్లో మత ప్రార్థనలకు హాజరై రాష్ర్టానికి వచ్చిన వారందరూ గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm