హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు సీఎం కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఇతర ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైతో కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో లాక్డౌన్ అమలు తీరును గవర్నర్కు వివరించారు. లాక్డౌన్ సమయంలో పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బియ్యం, నగదు పంపిణీపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్తో చర్చించారు. కరోనా అనుమానితుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలను సీఎం కేసీఆర్ గవర్నర్కు వివరించారు. దిల్లీ నిజాముద్దీన్లోని మర్కజ్కు తెలంగాణ నుంచి 1000 మందికి పైగా వెళ్లిన నేపథ్యంలో వారి గర్తింపునకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను గవర్నర్ తమిళిసైకి వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm