నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని ర్యాగట్లపల్లి గ్రామంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని సర్పంచ్ గంగయ్య ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ గంగయ్య మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ ఉన్నందున ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పత్రాలను రేషన్ షాప్ డీలర్లకు అందజేసి ఉచితంగా అందజేస్తున్న రేషన్ బియ్యాన్ని తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సౌందర్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Apr 01,2020 06:37PM