హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో తబ్లీగీ జమాత్ ఇటీవల నిర్వహించిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొని కూడా ఇప్పటివరకూ అధికారులకు సమాచారమివ్వకుండా తప్పించుకు తిరుగుతున్నవారిపై హత్యాయత్నం అభియోగాలు మోపాలని కొన్నిచోట్ల అధికారవర్గాలు యోచిస్తున్నాయి. కఠినమైన జాతీయ భద్రత చట్టాన్ని(ఎన్ఎస్యేను) వారిపై ప్రయోగించే అంశాన్నీ పరిశీలిస్తున్నాయి. 'తబ్లీగీ' కార్యక్రమంలో కనీసం 9 వేలమంది పాల్గొన్నట్లు అంచనా. వారిలో ఎక్కువమంది తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లొచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగినవారంతా పరీక్షలు చేయించుకోవాలని దేశవ్యాప్తంగా అధికారవర్గాలు సూచించినా, చాలామంది ఇప్పటికీ బయటకు రావట్లేదు.
Mon Jan 19, 2015 06:51 pm