కామారెడ్డి: జిల్లాలోనిక ఎల్లారెడ్డి మండలం అడివి లింగాల గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పశువుల కోసం గడ్డి కోయడానికి వెళ్లిన శివగారి అశోక్(35)కు ఫిట్స్ రావడంతో పక్కనే ఉన్న పిల్లకాలువలో పడిపోయాడు. దీంతో తల నీటిలో మునిగి ఊపిరి ఆడక మృతి చెందాడు. పొలం పనులకు వచ్చిన పక్క పొలాల రైతులు గుర్తించి దగ్గరికి వచ్చి చూసే సరికి అప్పటికే మృతి చెంది ఉన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm