హైదరాబాద్ : కరోనా లాక్డౌన్తో దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. అయితే, రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై కొన్ని రాష్ట్రాలు పెదవి విరిస్తున్నాయి.. ఆర్థిక నిపుణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. దీనిని ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ అంకెలగారిడీగా వ్యాఖ్యానించగా.. తాజాగా స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు.. బీజేపీది బొంద మీది ప్యాకేజీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఇక, ముస్లింల వల్లే కరోనా విస్తృతి అయిందనడం పూర్తిగా నిజం కాదన్న ఆయన.. ఒకరిద్దరు చేసిన తప్పుని అందరికీ రుద్దొద్దని హితవు పలికారు. మరో రెండేళ్ల వరకు కరోనాతో కలిసి జీవించాల్సిందేనని వ్యాఖ్యానించిన మంత్రి ఎర్రబెల్లి.. టీకాలు వచ్చినా సరే, ఈ పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలే అంటున్నారని గుర్తుచేశారు. ఇక, కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు.. రాష్ట్రాన్ని కుదవ పెడితే అప్పులిస్తారట అని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కరోనా కష్టకాలంలో ఆదుకోవాల్సింది పోయి.. అక్కరకు రాని ప్యాకేజీలు ప్రకటించారని దుయ్యబట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm