హైదరాబాద్ : ఖమ్మం జిల్లా మధిర పట్టాణానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి మాలతి తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం మధిర పట్టణానికి చెందిన ఓ వ్యాపారి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఈ నెల 1వ తేదీన చికిత్సకోసం హైదరాబాద్ వెళ్లాడు గత మూడు రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా అతని రక్తనమూనాలను పరీక్షించగా బుధవారం సాయంత్రం కరోనా పాజిటివ్ వచ్చినట్లు హైదరాబాద్ నుండి తమకు సమాచారం వచ్చిందని ఆమె తెలిపారు. పాజటివ్ వచ్చిన వ్యక్తి గత 27రోజులుగా హైదరాబాద్ లోనే ఉండటంతో ఈ వ్యాది అక్కడే సోకినట్లు ఆమె తెలిపారు. మధిర ప్రాంత ప్రజలు ఆందోళన పడవలసిన అవసరం లేదని అప్రమత్తంగా ఉండాలని ఆమె తెలిపారు. మధిర వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగడంతో మహాదేవపురం సంఘటన ఉండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు ఈ వార్తతో నెత్తిమీద పిడుగు పడినట్లు అయింది.
Mon Jan 19, 2015 06:51 pm