హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నిబంధనలను మినహాయింపు ఇచ్చింది. రాత్రి పూట కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల నుంచి వచ్చే బస్సులు ఎంజీబీఎస్లో ఆగేందుకు అవకాశం కల్పించింది. రాత్రి వేళల్లో బస్టాండుల్లో ప్రయాణికుల కోసం ట్యాక్సీలు, ఆటోలకు అనుమతి ఇచ్చింది. అయితే జిల్లాల నుంచి బస్సుల్లో వచ్చే ప్రయాణికులను జేబీఎస్లోనే దించేస్తారు. గురువారం నుంచి ఇమ్లీబన్కు కూడా బస్సులు నడుపుతారు. హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, మరికొన్ని రోజుల వరకు నగరంలో సిటీ బస్సులకు అనుమతి నిరాకరించారు. అంతర్రాష్ట్ర బస్సులను కూడా మరికొన్ని రోజుల పాటు అనుమతించరు.
Mon Jan 19, 2015 06:51 pm