చెన్నై: తమిళనాడులో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గురువారం ఒక్కరోజే తమిళనాడులో 827 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి సి.విజయభాస్కర్ తెలిపారు. దీంతో.. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,372కు చేరింది. తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒక్కరోజే తమిళనాడులో 12 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకూ కరోనా వల్ల తమిళనాడులో 145 మంది మరణించారు.
Mon Jan 19, 2015 06:51 pm