హైదరాబాద్ : ఇరువురు పీకలదాకా మద్యం సేవించారు అప్పటిదాకా బాగానే ఉన్నా ఆ ఇరువురికి అంతలోనే మనస్పర్థలు వచ్చాయి దీంతో వారు దూషించుకుంటూ గొడవకు దిగారు మద్యం మత్తులో ఒకరినొకరు తోసుకున్నారు ఇరువురిలో ఒక తాగుబోతు పట్టలేని కోపంతో మరొక తాగుబోతు కుడిచేతి చూపుడు వేలును బలంగా కొరికి సగ భాగం కిందపారేశాడు.. ఈ సంఘటన వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం వెనుక భాగంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని బాధితుడుని చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm