ఖమ్మం : అక్రమంగా నిల్వ ఉంచిన 50 లారీల ఇసుక డంప్ను టాస్క్ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయి సమీపంలోని పాలేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను తవ్వి..ముజాహితిపురం సమీపంలో 1250 టన్నుల (50 లారీల) ఇసుక డంప్ చేశారని పోలీసులకు సమాచారమందింది. దీంతో టాస్క్ఫోర్స్ సీఐ రవికుమార్, ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పాలేరు వాగుపై చెక్డ్యామ్ నిర్మాణం చేపట్టిన ఓ కాంట్రాక్టర్ ఇసుకను నిల్వ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో పట్టుకున్న ఇసుకను సీజ్ చేసి..రెవెన్యూ అధికారులకు అప్పగించారు. తహసీల్దారు అరుణ, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు.
Mon Jan 19, 2015 06:51 pm