హైదరాబాద్: తెలంగాణలో గురువారం 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. కొత్తగా తెలంగాణకు చెందిన 66 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చిన 49 మందితో పాటు ఇద్దరు వలస కూలీలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకూ మొత్తం 2,216 మందికి కరోనా నిర్ధారణ కాగా ఇప్పటివరకూ కరోనాతో 67 మంది మృతి చెందారు. 844 యాక్టివ్ కేసులుండగా.. 1345 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm