- 2వ స్టోర్ను మియాపూర్లో ప్రారంభించేందుకు సిద్ధం
హైదరాబాద్: భారతదేశంలో అగ్రగామిగా ఉన్న ప్రీ- ఓన్డ్ కార్ల కంపెనీ రైట్ కార్స్,
హైదరాబాద్ లోని మియాపూర్లో తన 2వ స్టోర్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రారంభం నుంచి
ప్రీ-ఓన్డ్ కార్ల వ్యాపారంలో రైట్ కార్స్ అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తోంది. 2వ శాఖను ప్రారంభించిన సందర్భంలో రైట్ కార్స్ సీఈఓ మనిదీప్ కాటేపల్లి మాట్లాడుతూ, “ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తమ కుటుంబాలతో కలిసి రాకపోకలు సాగించేందుకు మరియు పర్యావరణ హితమైన రవాణా విధానం అవసరమని గుర్తించామని’’ పేర్కొన్నారు. దీని గురించి మరింత వివరిస్తూ ‘‘మెరుగైన సేవల విస్తరణ, కార్ల నాణ్యతలో హామీని ఇచ్చేందుకు మేము 2వ శాఖను ప్రారంభిస్తున్నాము. ఇది మా కొనుగోలుదారుల అభిరుచుల మేము అర్థం చేసుకున్నామనేందుకు ఇది ఒక రుజువు. గత 3 సంవత్సరాల్లో, రైట్ కార్స్ ఒకే లావాదేవీతో పని పూర్తి అయిందని కాకుండా, తన వినియోగదారులతో దీర్ఘకాలిక సంబంధాన్ని ఏర్పరచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాము. ఎందుకంటే మేము కార్ల వ్యాపారాలపై ముందస్తుగా ఊహించే అపనమ్మకాలను, అపోహలను తొలగించేందుకు పెద్ద పీట వేయడమే అందుకు కారణమని’’ వివరించారు.
గత కొన్నేళ్లలో 10,000కు పైగా కార్లను విక్రయించిన రైట్ కార్స్ తన ప్రతి వినియోగదారునికి సంతృప్తిని
అందించేందుకు ప్రతి కారుకు 3 సంవత్సరాల వారంటీ, ఒక సంవత్సరం RSA (రోడ్ సైడ్ అసిస్టెన్స్)
అందించే ప్రత్యేకమైన ప్రతిపాదనలపై దృష్టి సారించింది. కారును విక్రయించేందుకు ముందుగా 200+
చెక్పాయింట్ల తనిఖీ నిర్వహించి, వినియోగదారులకు తాము కొనుగోలు చేస్తున్న కారుకు వాస్తవికత
ఉందని తెలుసుకునేందుకు ఇది పూర్తి పారదర్శకతను అందిస్తుంది. ఈ క్లిష్ట సమయాల్లో, రైట్ కార్స్ తన వినియోగదారుల ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకుంటూ, వారికి అనుగుణమైన ఆర్థిక సహకారాన్ని పొందేందుకు పలు ఎంపికలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. వివిధ బ్యాంకులు మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలతో (NBFCS) సంబంధాలు కలిగి ఉన్న ఏకైక ప్రీ-ఓన్డ్ కార్ల కంపెనీ రైట్ కార్స్ మాత్రమే.
కొవిడ్-19 మహమ్మారి విస్తరిస్తున్న ఈ సమయంలో ఆర్థిక సమస్యను ఎదుర్కొంటున్న కొనుగోలుదారుల కోసమే RC స్మార్ట్ ప్లాన్ పేరిట నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులు 3 నెలల EMI తాత్కాలిక వాయిదాను, ఎంచుకున్న మోడళ్లపై 7 ఏళ్ల వరకు EMI పద్ధతిలో రుణ చెల్లింపు సౌకర్యాన్ని పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. చాలా సరళమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియతో వినియోగదారులకు తమకు నచ్చిన కారును కొనుగోలు చేసుకునేందుకు సహకరిస్తుంది. లాక్డౌన్ పరిస్థితుల్లో, ప్రజా రవాణా వ్యవస్థలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, తన
వినియోగదారులకు ఉచిత పికప్ మరియు డ్రాప్ సేవలను రైట్ కార్స్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. వైరస్ను ఎదుర్కొనేందుకు, భౌతిక దూరాన్ని పాటించేందుకు మరియు మీ కుటుంబాన్ని సంరక్షించేందుక కార్స్ స్మార్ట్ బై బ్యాక్ ప్లాన్గా వ్యవహరించే ఎంపికను కూడా రైట్ కార్స్ అందుబాటులోకి తీసుకు రాగా, దీనితో వినియోగదారులు తమ వాహనాన్ని తక్కువ వ్యవధిలో తిరిగి కొనుగోలు చేసుకునేందుకు అవకాశంఉంటుంది.
భారతదేశంలో అగ్రగామిగా ఉన్న ప్రీ- ఓన్డ్ కార్ల కంపెనీ రైట్ కార్స్ కాగా, కార్లను కొనుగోలు
చేసుకునేందుకు, విక్రయించుకునేందుకు ఒన్-స్టాప్ గమ్యంగా మరియు వినియోగదారులకు ప్రాధమిక
ఎంపికగా రూపుదిద్దుకుంది. మియాపూర్లో తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా, టెక్ కంపెనీల్లో పని చేసే పలువురికి తమ కార్లను ఎంచుకునేందుకు మరియు సరైన కారును సొంతం చేసుకునేందుకు మరింత ఎక్కువ అవకాశం కలిగింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 30,2020 04:19PM